Breaking News

నా పేరు ఏపీకే.. క్లిక్‌ చేస్తే కష్టాలే..!


Published on: 11 Dec 2025 16:23  IST

జలుమూరు మండలంలో ఓ సచివాలయ ఉద్యోగిని చరవాణికి రెండు నెలల కిందట ఏపీకే ఫైల్‌ వచ్చింది. దాన్ని క్లిక్‌ చేస్తే సైబరు నేరగాళ్లు ఫోన్‌ను హ్యాక్‌ చేసి బ్యాంకు ఖాతాలోని రూ.2.12 లక్షలు దోచేశారు. తర్వాత విషయం తెలుసుకుని లబోదిబోమంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు.టెక్కలికి చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగికీ ఇలాగే జరిగింది. ఏపీకే ఫైల్‌ను క్లిక్‌ చేసి రూ.7.18 లక్షలు పోగొట్టుకున్నారు. వెంటనే విషయం ఎవరికీ చెప్పుకోలేదు. మూడు రోజుల తర్వాత సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి