Breaking News

అఖండ 2 నిర్మాణ సంస్థకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట లభించింది.

అఖండ 2 నిర్మాణ సంస్థకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట లభించింది. అఖండ 2 సినిమాకు టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్పెండ్ చేస్తూ నిన్న (డిసెంబర్ 11, 2025) హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను, ఈరోజు (డిసెంబర్ 12, 2025) హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.


Published on: 12 Dec 2025 15:44  IST

అఖండ 2 నిర్మాణ సంస్థకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట లభించింది. అఖండ 2 సినిమాకు టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్పెండ్ చేస్తూ నిన్న (డిసెంబర్ 11, 2025) హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను, ఈరోజు (డిసెంబర్ 12, 2025) హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.

సింగిల్ బెంచ్ తమ వాదనలు వినకుండానే టిక్కెట్ ధరల పెంపు జీవోను సస్పెండ్ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ '14 రీల్స్ ప్లస్' (14 Reels Plus) డివిజన్ బెంచ్‌కు తెలిపింది.డివిజన్ బెంచ్ నిర్ణయంతో, నిర్మాతలు టిక్కెట్లను పెంచిన ధరలకు విక్రయించే అవకాశం ఏర్పడింది, ఇది సినిమా విడుదల రోజున వారికి పెద్ద ఊరట.మరోవైపు, సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఉన్నప్పటికీ టిక్కెట్లను అధిక ధరలకు విక్రయించినందుకు బుక్‌మైషో (BookMyShow) పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి