Breaking News

ఎంపీపీ లాలూ నాయక్ అల్లుడు చేతిలో హతం

మహబూబాబాద్ జిల్లా గార్ల మాజీ ఎంపీపీ బానోత్ లాలూ నాయక్ తన అల్లుడు గాంధీ నాయక్ చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ పట్టణంలో డిసెంబర్ 12, 2025న జరిగింది. 


Published on: 12 Dec 2025 16:32  IST

మహబూబాబాద్ జిల్లా గార్ల మాజీ ఎంపీపీ బానోత్ లాలూ నాయక్ తన అల్లుడు గాంధీ నాయక్ చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ పట్టణంలో డిసెంబర్ 12, 2025న జరిగింది. 

గార్ల మండలం మర్రిగూడెం శివారు బొజ్జ తండాకు చెందిన బానోత్ లాలూ నాయక్ (మాజీ ఎంపీపీ), కురవి మండలం పెద్దతండాకు చెందిన గాంధీ నాయక్‌కు మూడేళ్ల క్రితం లాలూ నాయక్ కుమార్తె లహరితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.అయితే, అల్లుడు గాంధీ నాయక్ తన కుమార్తెను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు.ఈ విషయమై ప్రశ్నించేందుకు మామ లాలూ నాయక్ తన అల్లుడి ఇంటికి వెళ్లారు. అక్కడ జరిగిన గొడవలో గాంధీ నాయక్ తన మామపై దాడి చేయడంతో లాలూ నాయక్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు.ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి