Breaking News

పెట్టుబడి కేవలం రూ.4 వేలు..


Published on: 16 Dec 2025 17:38  IST

కర్నూలు జిల్లా బెళగల్ మండల పరిధిలోని సంగాల గ్రామానికి చెందిన శంకరన్న పొలంలో చిట్టి ముత్యాలు వేయగా మంచి దిగుబడి వచ్చింది. అరెకరం పొలంలో 6 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుబడి సాధించారు. ఈ రకం ధాన్యానికి ప్రస్తుతం మార్కెట్లో క్వింటా రూ.6500 నుంచి రూ.7500 వరకు ధర పలుకుతోంది. ఆరు క్వింటాళ్ల దిగుబడికి క్వింటా రూ.6500 చొప్పున రూ. 39 వేలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడి రూ.4 వేలు పోను రూ. 35 వేల నికర లాభం వస్తుందని రైతు శంకరన్న పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి