Breaking News

అనంత్ అంబానీ వంతారా నుంచి హైదరాబాద్‌కు


Published on: 16 Dec 2025 17:48  IST

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు త్వరలో కొత్త అతిథులు రానున్నారు. జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా అనంత్ అంబానీకి చెందిన వంతారా నుంచి ఒక కంగారూ జంట ఒక మగ, ఒక ఆడ హైదరాబాద్ జూ పార్క్‌కు రానున్నాయి.దీనికి ప్రతీగా వంతారాకు ఒక ఏనుగును ఇవ్వనున్నారు. ఇదే తరహా మార్పిడి లో ఈ ఏడాది అక్టోబర్‌లో మూడు దశాబ్దాల తర్వాత హైదరాబాద్ జూకు రెండు మగ,ఒక ఆడ జీబ్రాలు వచ్చాయి. అదే సమయంలో హైదరాబాద్ నుంచి 20 మౌస్ డీర్‌లను వంతారాకు తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి