Breaking News

ఖమ్మంలో గంజాయి లేకుండా చేస్తా


Published on: 18 Dec 2025 16:41  IST

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు అడిగినవన్నీ ఇస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు (గురువారం) ఖమ్మం నగరంలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కబ్జా చేసే వాళ్ళని, గొడవలు చేసే వాళ్ళని, గంజాయి బ్యాచ్‌లను ఖమ్మంకు దూరం చేయమని ప్రజలు అడిగినట్లు తెలిపారు. ఖమ్మంలో గంజాయి కూడా లేకుండా చేస్తా అని.. కబ్జాలు కూడా లేకుండా చేస్తానని మాట ఇచ్చానని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి