Breaking News

అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం ఇద్దరు మృతి

అన్నమయ్య జిల్లా రాయచోటిలో నేడు (22 డిసెంబర్ 2025, సోమవారం) జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.


Published on: 22 Dec 2025 16:43  IST

అన్నమయ్య జిల్లా రాయచోటిలో నేడు (22 డిసెంబర్ 2025, సోమవారం) జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. రాయచోటి – గాలివీడు ప్రధాన రహదారిపై ఉన్న యండపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది.మార్గమధ్యంలో నిర్మాణంలో ఉన్న ఒక కల్వర్టును యువకులు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో వెంకటసాయికుమార్‌ మరియు లక్ష్మీప్రసాద్‌ అనే ఇద్దరు యువకులు మరణించారు.వెంకటసాయికుమార్‌ ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందాడు.తీవ్రంగా గాయపడిన లక్ష్మీప్రసాద్‌ను 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి