Breaking News

ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‌ అరెస్ట్

తెలంగాణ ఏసీబీ అధికారులు మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మూడ్ కిషన్ నాయక్ నివాసం మరియు ఆయన బంధువుల ఇళ్లపై భారీ దాడులు నిర్వహించారు.


Published on: 24 Dec 2025 12:58  IST

తెలంగాణ ఏసీబీ అధికారులు మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మూడ్ కిషన్ నాయక్ నివాసం మరియు ఆయన బంధువుల ఇళ్లపై భారీ దాడులు నిర్వహించారు. దాడుల్లో సుమారు ₹12.72 కోట్ల విలువైన (డాక్యుమెంట్ విలువ) ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఇవి ₹500 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా.

కిషన్ నాయక్ నివాసంలో సుమారు 1 కేజీ బంగారం₹1.37 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, హుండా సిటీ మరియు ఇన్నోవా క్రిస్టా కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నిజామాబాద్‌లోని లాహిరి ఇంటర్నేషనల్ హోటల్‌లో 50% వాటా, 3,000 చదరపు గజాల రాయల్ ఓక్ ఫర్నిచర్ షోరూమ్, సంగారెడ్డిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి మరియు నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో 10 ఎకరాల కమర్షియల్ భూమి ఉన్నట్లు గుర్తించారు.ఆదాయానికి మించిన ఆస్తుల (DA Case) కింద కేసు నమోదు చేసి కిషన్ నాయక్‌ను అరెస్ట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి