Breaking News

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం..!


Published on: 12 May 2025 08:54  IST

తిరుపతి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడు తిరువన్నమలై నుంచి శ్రీవారి భక్తులుతో తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి