Breaking News

రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ ఫైర్


Published on: 12 May 2025 16:49  IST

జిన్నారం మదర్సాపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ సరైన సమాధానం ఇవ్వకపోతే డీవోపీటీకి ఫిర్యాదు చేస్తానని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. రేవంత్ ప్రభుత్వం దేశ ద్రోహులకు మద్దతు ఇస్తుందా అని ప్రశ్నించారు. ఒక ఎంపీగా అడిగిన ప్రశ్నలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సరైన సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు. జిన్నారం మత ఘర్షణలో అరెస్ట్ అయిన బీజేపీ కార్యకర్తలను ఇవాళ(సోమవారం) సంగారెడ్డి సెంట్రల్ జైల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలిశారు. ఈ సందర్భంగా రఘునందన్ మీడియాతో మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి