Breaking News

విశాఖ రైల్వేస్టేషన్‌లో నకిలీ కరెన్సీ స్వాధీనం

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో జనవరి 23, 2026న భారీగా నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Published on: 23 Jan 2026 16:34  IST

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో జనవరి 23, 2026న భారీగా నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ రైల్వే పోలీసుల (GRP) తనిఖీల్లో ఇద్దరు యువకులు పట్టుబడ్డారు.పట్టుబడిన వారిలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సునీల్, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన నితీశ్‌ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుండి రూ. 3,32,200 విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల వద్ద ప్రధానంగా రూ. 200 నకిలీ నోట్లు ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. విశాఖ జీఆర్‌పీ ఇన్స్‌పెక్టర్‌ ధనంజయనాయుడు నేతృత్వంలో స్టేషన్‌లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ నకిలీ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి