Breaking News

‘సెవెన్‌ సిస్టర్స్‌’ గురించి నోరుపారేసుకున్న యూనస్


Published on: 14 May 2025 15:29  IST

బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి మహమ్మద్‌ యూనస్ భారత్‌ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారు. బంగ్లాదేశ్‌, నేపాల్, ఈశాన్య రాష్ట్రాలకు సమగ్ర ఆర్థిక సమైక్యతా ప్రణాళిక అవసరమని జలశక్తి, ఆరోగ్య సంరక్షణ, రవాణా, మౌలిక సదుపాయాలు వంటి అంశాల్లో సహకారం ముఖ్యమంటూ మాట్లాడారు. నేపాల్ డిప్యూటీ స్పీకర్‌తో భేటీ సందర్భంగా మన రాష్ట్రాల ప్రస్తావన తెచ్చారు. పాకిస్థాన్‌, చైనాతో సంబంధాల కోసం ఆరాటపడుతూ ఈ తరహా వైఖరిని ప్రదర్శిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి