Breaking News

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ 20వ 'వాటర్ డైజెస్ట్ వరల్డ్ వాటర్ అవార్డ్స్' లో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును గెలుచుకుంది

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB), అంటే మన జలమండలి, 2026 మార్చిలో జరిగిన 20వ 'వాటర్ డైజెస్ట్ వరల్డ్ వాటర్ అవార్డ్స్' లో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును గెలుచుకుంది. 


Published on: 25 Mar 2026 19:46  IST

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB), అంటే మన జలమండలి, 2026 మార్చిలో జరిగిన 20వ 'వాటర్ డైజెస్ట్ వరల్డ్ వాటర్ అవార్డ్స్' లో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును గెలుచుకుంది. 

జలమండలి చేపట్టిన బ్లూ అండ్ గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కు ఈ గౌరవం దక్కింది.ఈ అవార్డుల ప్రధానోత్సవం 2026 మార్చి 23న న్యూఢిల్లీలో జరిగింది.

పాలపిట్ట పార్క్ మరియు బొటానికల్ గార్డెన్‌లో తక్కువ ఖర్చుతో కూడిన పర్యావరణ అనుకూల పద్ధతుల ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి, ఆ నీటిని మొక్కలకు మరియు జలవనరుల పునరుద్ధరణకు వాడుతున్నందుకు ఈ అవార్డు లభించింది.జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, సీజీఎం పద్మజ నుండి ఈ అవార్డును అందుకున్నారు. 

కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు సి.ఆర్. పాటిల్ మరియు రాజ్ భూషణ్ చౌదరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. మురుగునీటి శుద్ధి మరియు నీటి పునర్వినియోగంలో జలమండలి చూపుతున్న చొరవకు ఈ గుర్తింపు దక్కింది. 

Follow us on , &

ఇవీ చదవండి