Breaking News

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలోని 10 జన్పథ్ నివాసంలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం (జనవరి 27, 2026) ఢిల్లీలోని 10 జన్పథ్ నివాసంలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.


Published on: 28 Jan 2026 12:46  IST

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం (జనవరి 27, 2026) ఢిల్లీలోని 10 జన్పథ్ నివాసంలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ చేపట్టబోయే భారీ ఆందోళనలో పాల్గొనాల్సిందిగా షర్మిల రాహుల్ గాంధీని ఆహ్వానించారు.

ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లి (పథకం ప్రారంభమైన గ్రామం) నుంచి ఈ ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు.

షర్మిల ఆహ్వానానికి రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఏపీకి వస్తానని హామీ ఇచ్చారని సమాచారం.ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, పేరు మార్చి పేదల హక్కులను హరిస్తోందని ఈ సందర్భంగా షర్మిల విమర్శించారు.ఈ భేటీలో ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం మరియు సంస్థాగత కమిటీల నియామకంపై కూడా చర్చలు జరిగాయి. 

Follow us on , &

ఇవీ చదవండి