Breaking News

తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈరోజు డిసెంబర్ 11, 2025న జరుగుతోంది

తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈరోజు డిసెంబర్ 11, 2025న జరుగుతోంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. 


Published on: 11 Dec 2025 10:58  IST

తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈరోజు డిసెంబర్ 11, 2025న జరుగుతోంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు.పోలింగ్ ముగిసిన తర్వాత, మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను అదే రోజు ప్రకటిస్తారు.

తొలి విడతలో మొత్తం 3,834 సర్పంచ్ మరియు 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.తొలి విడత నోటిఫికేషన్ విడుదలైన 4,236 గ్రామ పంచాయతీలలో, ఇప్పటికే కొన్ని సర్పంచ్ స్థానాలు (సుమారు 395) ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో (డిసెంబర్ 11, 14, మరియు 17 తేదీల్లో) నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. 

Follow us on , &

ఇవీ చదవండి