Breaking News

భారత వైమానిక రంగం పెట్టుబడులకు అద్భుత అవకాశాల గని అని అన్న ప్రధాని నరేంద్ర మోదీ

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత వైమానిక రంగం పెట్టుబడులకు అద్భుత అవకాశాల గని అని అన్న ప్రధాని నరేంద్ర మోదీ .


Published on: 03 Jun 2025 08:40  IST

భారతదేశం లో వైమానిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇది ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడిదారులకు అద్భుత అవకాశాల గమ్యంగా మారుతోంది. ఈ విషయాన్ని ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) వార్షిక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. విమానాల నిర్వహణ, మరమ్మత్తులు, కార్యకలాపాల (MRO) రంగం 2030 నాటికి సుమారు 400 కోట్ల డాలర్లకు పెరుగుతుందని చెప్పారు. విదేశీ సంస్థలు భారత్‌ను కేవలం ఒక మార్కెట్‌గా కాకుండా, సమగ్ర విలువ జ్ఞాపకం (వాల్యూ చైన్) కేంద్రముగా చూడాలని సూచించారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా ఎదిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు విమాన సదుపాయాన్ని చేరువ చేసే ఉడాన్ పథకం వల్ల ప్రజల ప్రయాణ జీవితం మారిందని చెప్పారు. భారత్‌ను విమాన తయారీ, నిర్వహణకు కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయర్ కంపెనీ భారత్‌లో అసెంబ్లీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని, అయితే భారత ఎయిర్‌లైన్స్ నుంచి కనీసం 200 విమానాల ఆర్డర్ వస్తేనే ఇది సాధ్యమవుతుందని ఆ కంపెనీ సీఈఓ ఫ్రాన్సిస్కో గోమెజ్ నెటో చెప్పారు. ప్రస్తుతం ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, వచ్చే ఐదేళ్లలో దేశంలో కొత్తగా 50 విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 2014లో 74 ఎయిర్‌పోర్టులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 164కి చేరిందని చెప్పారు. ఉడాన్ పథకం కింద ఇప్పటివరకు 619 విమాన మార్గాలు ప్రారంభమయ్యాయని వివరించారు. అంతర్జాతీయ విమానయాన రంగం ఈ సంవత్సరం సుమారు 97,900 కోట్ల డాలర్ల ఆదాయం పొందుతుందని, దానిలో 3,600 కోట్ల డాలర్లు లాభంగా ఉండే అవకాశం ఉందని IATA అంచనా వేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 360 కోట్ల డాలర్ల పెరుగుదల. ప్రస్తుతం ప్రపంచ GDPలో విమానయాన రంగం 3.9 శాతం వాటా కలిగి ఉందని పేర్కొన్నారు. భారత్‌లో ఈ రంగం నేరుగా 3.69 లక్షల మందికి ఉపాధిని కల్పించగా, పర్యాటక రంగం కలుపుకొని చూస్తే మొత్తం 77 లక్షల మందికి ఉపాధి, జీడీపీకి 1.5 శాతం మద్దతు ఇస్తోంది. ఖర్చులు, పన్నులు పెరిగినా, విమానయాన సంస్థల వాస్తవ వ్యయాలు గత 10 సంవత్సరాలలో 40 శాతం తగ్గాయని ఐఏటీఏ వెల్లడించింది. ఇవన్నీ చూస్తే భారత వైమానిక రంగం భవిష్యత్తులో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే స్థాయికి ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి