Breaking News

​​​​​​​అమెరికాలో ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద కాల్పులు – ఒకరు మృతి, ఇద్దరు తీవ్రంగా గాయాలు

​​​​​​​అమెరికాలో ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద కాల్పులు – ఒకరు మృతి, ఇద్దరు తీవ్రంగా గాయాలు


Published on: 25 Sep 2025 10:41  IST

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన కలకలం రేపింది. టెక్సాస్‌లోని డల్లాస్ నగరంలో ఉన్న యూఎస్‌ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) కార్యాలయం సమీపంలో జరిగిన దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనను ఎఫ్‌బీఐ లక్ష్యిత హింసాత్మక చర్యగా పరిగణించి దర్యాప్తు ప్రారంభించింది. దాడి చేసిన వ్యక్తిని జోషువా జాన్గా గుర్తించారు. అతను కూడా గాయాల కారణంగా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, మృతుడు ఇమిగ్రేషన్ అధికారుల అదుపులో ఉన్న డిటైనీ అని తెలిసింది. గాయపడిన వారిలో ఒకరు మెక్సికోకు చెందిన వ్యక్తి కాగా, ప్రస్తుతం ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

దాడి చోటుచేసుకున్న ప్రదేశంలో పోలీసులు సేకరించిన బుల్లెట్ కేసింగ్‌లపై ఐసీఈ వ్యతిరేక నినాదాలు రాసి ఉండటంతో, ఈ ఘటన వెనుక ఉన్న ఉద్దేశంపై ఎఫ్‌బీఐ మరింత లోతైన దర్యాప్తు జరుపుతోంది. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ ప్రకారం, ఈ సందేశాలు దాడి వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో కీలకంగా ఉండవచ్చని తెలిపారు.

ఈ సంఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఈ హింసాత్మక చర్యలకు రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్స్ కారణమని ఆయన వ్యాఖ్యానించారు.

డల్లాస్‌లో జరిగిన ఈ కాల్పులు, అమెరికాలో ఇమిగ్రేషన్ సంబంధిత ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగలేదని మరోసారి బయటపెట్టాయి. దీనితో దేశవ్యాప్తంగా భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలా అనే చర్చ ప్రారంభమైంది.

Follow us on , &

ఇవీ చదవండి