Breaking News

ఏనుగు దంతాల స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్ట్


Published on: 25 Jun 2025 18:47  IST

ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటికి చెందిన నిందితుడు రేకులకుంట ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్ వద్ద నుంచి 5.6 కిలోల రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దంతాల విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. ఎస్‌వోటీ, ఫారెస్ట్ అధికారుల జాయింట్ ఆపరేషన్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. తిరుపతి శేషాచలం పారెస్టు నుంచి ఏనుగు దంతాలను నిందితుడు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి