Breaking News

అక్కడ కేజీ చక్కెర రూ.7వేలు..లీటర్‌ పెట్రోల్‌ రూ.2 వేలు!


Published on: 11 Jul 2025 19:00  IST

ఇజ్రాయెల్‌ చేస్తున్న భీకర యుద్ధంతో ఆర్థికంగా కుదేలైన గాజాలో పరిస్థితులు దారుణంగా మారినట్లు తెలుస్తోంది. ఆహారం, ఇంధనం, ఔషధాల కొరత ఎదుర్కొంటున్న పాలస్తీనియన్లకు కరెన్సీ కష్టాలు తీవ్రమయ్యాయి. యుద్ధం నేపథ్యంలో అక్కడి బ్యాంకులు, ఏటీఎంలు పనిచేయకుండా పోవడంతో తాజా పరిస్థితి తలెత్తింది. చక్కెర ధర యుద్ధానికి ముందు కిలో ధర 2 డాలర్లుగా ఉండగా ఇప్పుడది 80-100 డాలర్లు పలుకుతోందని స్థానికుడు పేర్కొన్నాడు. లీటరు పెట్రోల్‌ 25 డాలర్లుగా ఉందని చెప్పాడు.

Follow us on , &

ఇవీ చదవండి