Breaking News

42 శాతం సాధిస్తాం:రేవంత్‌రెడ్డి


Published on: 24 Jul 2025 09:55  IST

కేంద్రం మెడలు వంచైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో మూడు వ్యవసాయ నల్లచట్టాలు చేస్తే.. వాటిని ఉపసంహరించుకునేలా చేశామని గుర్తు చేశారు. తొలుత మొండికేసిన బీజేపీ ప్రభుత్వ మెడలు వంచి రద్దు చేయించామని అన్నారు. చివరికి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందన్నారు. బుధవారం ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి