Breaking News

బాహుదా నదికి పోటెత్తిన వరద..


Published on: 29 Oct 2025 12:23  IST

మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇచ్ఛాపురం జలదిగ్భంధంలో ఉండిపోయింది. ఒడిశాలోని భగలట్టి డ్యాం గేట్లు ఎత్తివేయటంతో బాహుదా నదికి వరద పోటెత్తడంతో ఉగ్రరూపం దాల్చింది. ఇక భారీ వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగలు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వరద కారణంగా ఇచ్ఛాపురంలోని పాత వంతెన వద్ద నిర్మించిన శివాలయం నీటమునిగింది.

Follow us on , &

ఇవీ చదవండి