Breaking News

సమస్యలు చెప్పండి.. పార్లమెంటులో ప్రస్తావిస్తా


Published on: 01 Dec 2025 12:07  IST

నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సోమవారం నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏపీ యువతకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని సహచర టీడీపీ ఎంపీలతో కలిసి పార్లమెంటులో ప్రస్తావిస్తానని తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధితో పాటు యువత భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను తెలియజేయాలని కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి