Breaking News

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం సీరియస్..


Published on: 01 Dec 2025 18:33  IST

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఢిల్లీ కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల దహనమే కారణమన్న కేంద్రంపై మండిపడింది. రైతులను నిందించడమే కేంద్రానికి ఆనవాయితీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిడ్ సమయంలో కూడా రైతులు తమ పంట వ్యర్థాలను తగలపెట్టారని, అప్పుడు లేని కాలుష్యం ఇప్పుడెలా వచ్చిందని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.

Follow us on , &

ఇవీ చదవండి