Breaking News

మమతపై బీజేపీ వివాదాస్పద పోస్టు


Published on: 15 Dec 2025 19:07  IST

ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ బెంగాల్ విభాగం తాజా పోస్ట్ వివాదానికి తెరతీసింది.మమతా బెనర్జీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోలుస్తూ సోషల్ మీడియా 'ఎక్స్'లో బీజేపీ ఒక పోస్ట్ పెట్టింది. దీనికి 'నియంత భయపడుతోంది' (ది డిక్టేటర్ ఈజ్ రాటిల్ట్) అనే క్యాప్షన్ ఉంచింది. ఇద్దరి నేతల సగం సగం ఫోటోలను జతచేసి 'ఇద్దరూ ఒకటే' అని అభివర్ణించింది. ఈ పోస్టుపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి