Breaking News

దేశ రాజధానిలో బోనాల జాతర


Published on: 28 Jun 2025 14:52  IST

దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. సింహవాహిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు జూన్ 30 నుంచి జూలై 2వ వరకు ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్నామని సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. జూలై 1న ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉంటుందన్నారు. జూలై రెండవ తేదీన పోతురాజు, కళాకారుల నృత్యాలు ఉంటాయని వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి