Breaking News

లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు..


Published on: 14 Oct 2025 15:28  IST

మద్యం కుంభకోణం కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌లో ఏపీ సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌లో నలుగురు సిట్ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. ఏపీ లిక్కర్ స్కాం డబ్బులు పీఎల్‌ఆర్‌ ప్రాజెక్టులోకి మళ్లించినట్లు ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. పీఎల్‌ఆర్ ప్రాజెక్టులోకి రూ.15 కోట్లు, డికాట్ లాజిస్టిక్స్ నుంచి రూ. 25 కోట్లు మళ్లించినట్టు సిట్ గుర్తించింది.

Follow us on , &

ఇవీ చదవండి