Breaking News

ట్రోఫీ కోసం రంగంలోకి బీసీసీఐ..


Published on: 23 Oct 2025 12:16  IST

ఆసియా కప్ 2025 ఫైనల్ ముగిసి చాలా కాలమైనా, విజేతగా నిలిచిన టీమిండియాకు ఇంకా ట్రోఫీ దక్కకపోవడంతో ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ మొండి వైఖరిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.తాజాగా, బీసీసీఐ నుంచి గట్టి హెచ్చరిక అందడంతో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ లీగల్ విభాగాన్ని రంగంలోకి దించింది. రాబోయే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో, పీసీబీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి