Breaking News

మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ పిటిషన్‌


Published on: 21 Nov 2025 18:55  IST

మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ కోసం ఏపీ హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) మరోసారి విచారణ జరిగింది. మావోయిస్ట్ పార్టీ కీలక నేతలు దేవ్ జీ, రాజిరెడ్డి... పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవని.. వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. పోలీసుల వద్ద ఆ ఇద్దరు అగ్రనేతలు ఉన్నారనే దానిపై ఆధారాలు లభిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది.

Follow us on , &

ఇవీ చదవండి