Breaking News

సైబర్ ముఠా గుట్టు రట్టు చేసిన భీమవరం పోలీసులు


Published on: 27 Nov 2025 12:45  IST

అంతర్జాతీయ డిజిటల్ సైబర్ ముఠా గుట్టును భీమవరం పోలీసులు రట్టు చేశారు. రిటైర్డ్ ప్రొఫెసర్‌కు శర్మ సిమ్ కార్డు వచ్చిందని, సీబీఐ అధికారులమని సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేశారు. సిమ్ కార్డు తేడా ఉందని తాము సరి చేస్తామంటూ ఆయనకు తెలిపారు. అనంతరం డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని కూడా శర్మను బెదిరించారు. భయపడి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను సైబర్ మోసగాళ్లకు శర్మ తెలిపాడు. దీంతో13 రోజుల వ్యవధిలో శర్మ ఖాతాలో ఉన్న రూ.78 లక్షలు సైబర్ ముఠాను కాజేసింది.

Follow us on , &

ఇవీ చదవండి