Breaking News

విద్యుత్ షాక్‌తో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

యాదాద్రి జిల్లాలోని ఆత్మకూరు (ఎం) మండలం లింగరాజుపల్లిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భూషి గణేష్ (26) విద్యుత్ షాక్‌తో మరణించారు.


Published on: 28 Oct 2025 12:02  IST

యాదాద్రి జిల్లాలోని ఆత్మకూరు (ఎం) మండలం లింగరాజుపల్లిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భూషి గణేష్ (26) విద్యుత్ షాక్‌తో మరణించారు. బెంగళూరులోని ఒక కంపెనీలో పనిచేస్తున్న గణేష్, ప్రస్తుతం ఇంట్లో నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల తమ ఇంటి గోడలకు సిమెంట్ ప్లాస్టరింగ్ పనులు చేయించారు.పనుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప పైపులను తొలగిస్తున్నప్పుడు, ఆ పైపు గోడ పక్కన ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది.ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురైన గణేష్ తీవ్రంగా గాయపడ్డారు.ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మరణించారు.ఈ ప్రమాదంలో గణేష్ తండ్రి నర్సింహ కూడా గాయపడ్డారు. ఒకే ఒక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి