Breaking News

ఉక్రెయిన్‌లోని నీప్రోపెట్రోవిస్క్  ప్రాంతంలో రష్యా జరిపిన భీకర డ్రోన్ దాడిలో 15 మంది గని కార్మికులు మరణించారు.

ఉక్రెయిన్‌లోని నీప్రోపెట్రోవిస్క్  ప్రాంతంలో ఫిబ్రవరి 1, 2026న రష్యా జరిపిన భీకర డ్రోన్ దాడిలో 15 మంది గని కార్మికులు మరణించారు.


Published on: 02 Feb 2026 17:23  IST

ఉక్రెయిన్‌లోని నీప్రోపెట్రోవిస్క్  ప్రాంతంలో ఫిబ్రవరి 1, 2026న రష్యా జరిపిన భీకర డ్రోన్ దాడిలో 15 మంది గని కార్మికులు మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన

ఉక్రెయిన్‌కు చెందిన అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ DTEKలో పనిచేసే గని కార్మికులు, తమ షిఫ్ట్ ముగించుకుని బస్సులో ఇంటికి వెళ్తుండగా రష్యా డ్రోన్‌తో దాడి చేసింది.ప్రాథమికంగా 12 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మరణాల సంఖ్య 15కి పెరిగిందని ధృవీకరించింది. ఈ దాడిలో మరో 7 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దాడి నీప్రో (Dnipro) సమీపంలోని పావ్లోగ్రాడ్ (Pavlohrad) జిల్లాలో, టెర్నివ్కా (Ternivka) నగరం వద్ద జరిగింది.రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల రెండో రౌండ్ అబుదాబిలో జరగనుందని అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం.ఈ దారుణ ఘటనకు నిరసనగా ఫిబ్రవరి 2న నీప్రోపెట్రోవిస్క్ ప్రాంతంలో సంతాప దినం (Day of Mourning) ప్రకటించారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి