Breaking News

హర్మూజ్ జలసంధి లో ఒక చమురు ట్యాంకర్ సముద్రపు మైన్ ను ఢీకొని శక్తివంతమైన పేలుడుకు గురైంది

హర్మూజ్ జలసంధి లో ఒక చమురు ట్యాంకర్ సముద్రపు మైన్ ను ఢీకొని శక్తివంతమైన పేలుడుకు గురైంది. ఇరాన్ అధికారిక మీడియా సంస్థ అయిన తస్నిమ్ కథనం ప్రకారం, జూలై 26, 2026 ఆదివారం నాడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


Published on: 27 Jul 2026 10:35  IST

హర్మూజ్ జలసంధి లో ఒక చమురు ట్యాంకర్ సముద్రపు మైన్ ను ఢీకొని శక్తివంతమైన పేలుడుకు గురైంది. ఇరాన్ అధికారిక మీడియా సంస్థ అయిన తస్నిమ్ కథనం ప్రకారం, జూలై 26, 2026 ఆదివారం నాడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఇరాన్ ప్రభుత్వం నిర్దేశించిన సురక్షిత నౌకాయాన మార్గాన్ని ఉల్లంఘించి, పక్కకు తప్పుకోవడం వల్లే ఈ ట్యాంకర్ అక్కడ అమర్చిన నావికా మైన్‌ను ఢీకొట్టి పేలిపోయిందని ఇరాన్ వెల్లడించింది. తమ నిబంధనలు పాటించకుండా వేరే మార్గాల్లో వెళ్లే నౌకలు ప్రమాదాలు ఎదుర్కొంటే దానికి ఆ నౌకల యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్ ఇదివరకే హెచ్చరించింది.

ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేదా ఆ నౌక ఏ దేశానికి చెందినది అనే పూర్తి వివరాలను ఇరాన్ మీడియా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.గత కొన్ని వారాలుగా అమెరికా, ఇరాన్ మధ్య ప్రాంతీయ ఉద్రిక్తతలు మరియు సైనిక ఘర్షణలు తీవ్రమవ్వడంతో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ చమురు రవాణా మార్గంలో నౌకల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందోనని నిపుణులు గమనిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement