Breaking News

దయచేసి లొంగిపో.. ఉగ్రవాదితో తల్లి పలికిన మాటలు..


Published on: 16 May 2025 12:39  IST

జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం తెల్లవారుజామున భద్రతా దళాలు ఆపరేషన్‌ చేపట్టాయి.డ్రోన్ సాయంతో ముగ్గురు ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉన్నట్లు గమనించారు. వారి లో ఒకడు అమీర్ నజీర్ – అతని తల్లి వీడియో కాల్‌ చేసి దయచేసి లొంగిపో అంటూ ప్రాధేయపడింది. బతిమాలింది. కానీ ముష్కరుడి మనసు మాత్రం కరగలేదు. తీవ్రవాదం ముందు కన్నప్రేమ ఓడిపోయింది.అంతే క్షణాల్లోనే భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యాడు.తల్లి వీడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి