Breaking News

గుట్టపై బుట్టబొమ్మలు


Published on: 16 May 2025 14:04  IST

ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్టలో.. భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాల ప్రాంగణంలో ‘ప్రపంచ సుందరి’ పోటీదారులు గురువారం సందడి చేశారు. స్వర్ణతాపడంతో మెరుస్తున్న యాదాద్రీశుడి గోపురాలు.. కృష్ణశిలతో చేసిన ఆలయ ప్రాకారాలు.. స్తంభోద్భవుడి చారిత్రక.. ఆధ్యాత్మిక వైభవాలను ఆసక్తిగా తిలకించారు. సంప్రదాయ పట్టుపరికిణీలు, పట్టుచీరలు ధరించి.. లయబద్ధంగా నడుస్తూ అఖండదీపం వెలిగించారు. ఆలయ అర్చకులు నర్సింహమూర్తి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి