Breaking News

తిరువూరులో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తత..


Published on: 19 May 2025 17:50  IST

తిరువూరులో నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ నేతలు తోపులాటకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇరుపార్టీ నేతలను పోలీసులు చెదరగొట్టారు. ఇప్పటికే ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. అలాగే మరో ఐదుగురు సభ్యులు టీడీపీ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంటుందన్న ఉద్దేశంతో వైసీపీ సభ్యులు హైడ్రామాకు తెరలేపారు.

Follow us on , &

ఇవీ చదవండి