Breaking News

టీటీడీలో మరో స్కామ్ వెలికి తీసిన బీజేపీ నేత


Published on: 19 May 2025 18:07  IST

జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని పాలక మండలి సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీని ధనార్జన క్షేత్రంగా మార్చి స్వామి వారి ఖజానాకు తూట్లు పొడిచారంటూ గత ప్రభుత్వ పాలకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని తులాభారం నగదును అక్కడ సిబ్బంది తస్కరించారని ఆయన పేర్కొన్నారు. వాటిపై విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని విజిలెన్స్ ఎస్పీని కోరినట్లు ఆయన తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి