Breaking News

కేసీఆర్‌కు నోటీసులు.. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు


Published on: 20 May 2025 18:07  IST

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పెద్దపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు విలేకర్లతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. నోటీసులు ఇప్పుడే కదా ఇచ్చింది.. ఆయన వెళ్తారనే తాను అనుకుంటున్నానన్నారు. అయితే చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి