Breaking News

సింగ్‌పొరాలో నక్కిన నలుగురు ఉగ్రవాదులు..


Published on: 22 May 2025 12:55  IST

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌‌లోని ఛత్రులోని సింగ్‌పోరా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. సింగ్‌పోరా ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. వెంటనే ఉగ్రవాదులు, భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో రెండు వైపుల నుండి కాల్పులు కొనసాగుతున్నాయి.గురువారం(మే 22) సింగ్‌పోరా చత్రూలో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు అని సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి