Breaking News

పారపట్టి మట్టి పనులు చేసిన మంత్రి


Published on: 26 May 2025 14:02  IST

కడప జిల్లాలో తెలుగు దేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. రేపటి (మంగళవారం) నుంచి జరగబోయే టీడీపీ మహానాడుకు మంత్రులు కడపకు బయలుదేరి వెళ్తున్నారు. ఇప్పటికే చేరుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు మహానాడు ప్రాంగణం వద్ద స్వయంగా పనులు చేపట్టారు. పార పట్టుకుని మట్టి పనులు చేసిన మంత్రి.. తాను ఒక కార్యకర్తనే అనే విషయానే చెప్పకనే చెప్పారు. మరోవైపు మంత్రి సవిత కూడా పార్టీ కార్యకర్తలతో కలిసి సైకిల్‌‌పై మహానాడుకు బయలుదేరారు.

Follow us on , &

ఇవీ చదవండి