Breaking News

రేపే ఎన్నికలు పెట్టండి.. మోదీకి దీదీ సవాల్!


Published on: 29 May 2025 18:43  IST

బెంగాల్‌లో రేపే అసెంబ్లీ ఎన్నికలు పెట్టాలని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు మమతా బెనర్జీ. రాష్ట్ర ప్రజలంతా తమ వైపే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. తృణమూల్‌కు డోకా లేదని.. తక్షణం ఎన్నికలు నిర్వహించినా తమదే విజయమని దీదీ స్పష్టం చేశారు. కాగా, అలిపుర్‌దువార్‌లో జరిగిన సభలో మమతా సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు మోదీ. బెంగాల్ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందని.. ముర్షిదాబాద్, మాల్దా అల్లర్లే దీనికి ఉదాహరణ అని అన్నారు. గూండాలకు స్వేచ్ఛ ఇచ్చి ప్రజలపై ఉసిగొల్పారని ప్రధాని ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి