Breaking News

థర్డ్‌ పార్టీ సేవలతో రిస్క్‌..ఈపీఎఫ్‌ఓ అలర్ట్‌!


Published on: 16 Jun 2025 18:39  IST

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) చందాదారులకు అలర్ట్! ప్రావిడెండ్‌ ఫండ్‌కు సంబంధించిన సేవల విషయంలో థర్డ్‌ పార్టీ ఏజెంట్ల సాయం తీసుకోవద్దని ఈపీఎఫ్‌ఓ సూచించింది. కీలక వివరాలు వారికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బదులుగా ఆన్‌లైన్‌ పోర్టల్‌లో సొంతంగానే ఉచిత సేవలను వినియోగించుకోవాలని సూచించింది. చందాదారుల సౌకర్యార్థం సేవలను గతంతో పోలిస్తే సులభతరం చేశామని, వేగం, పారదర్శకత తీసుకొచ్చామని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి