Breaking News

వైభవ్ కంటే తోపు.. 41 ఫోర్లు, 22 సిక్సర్లతో 327 పరుగులు..


Published on: 17 Jun 2025 13:18  IST

ముజఫర్‌పూర్‌లోని డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్‌లో సంస్కృతి క్రికెట్ అకాడమీ తరపున ఆడిన అయాన్ రాజ్, 30 ఓవర్ల మ్యాచ్‌లో 134 బంతుల్లో అజేయంగా 327 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో 22 భారీ సిక్సర్లు, 41 ఫోర్లు ఉన్నాయి. అతని 327 పరుగులలో 296 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయి. ఇది అతని విధ్వంసకరమైన బ్యాటింగ్‌కు నిదర్శనం. అయాన్ స్ట్రైక్ రేట్ 220.89గా ఉంది. ఇది సీనియర్ టీ20 మ్యాచ్‌లలో కూడా అరుదుగా కనిపించే సంఖ్య.

Follow us on , &

ఇవీ చదవండి