Breaking News

పాత ఫీజులతోనే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌


Published on: 19 Jun 2025 09:38  IST

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ను ప్రస్తుతానికి పాత ఫీజులతోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా ఇంజినీరింగ్‌ కళాశాలల రుసుములపై లోతుగా అధ్యయనం చేయాలని, ఆలస్యమైనా పర్వాలేదని విద్యాశాఖ అధికారులకు స్పష్టం చేశారు. మరోవైపు ఏఐసీటీఈ నిర్దేశించిన ప్రకారం ఆగస్టు 14 నాటికి బీటెక్‌ తరగతులను ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యంలో టీఏఎఫ్‌ఆర్‌సీ కార్యాలయంలో బుధవారం కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి