Breaking News

ఏపీతో సాగునీటి యుద్ధం..రంగంలోకి కేసీఆర్‌


Published on: 19 Jun 2025 11:54  IST

రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్‌ సర్కారుపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. రైతుల ప్రయోజనాలే పరమావధిగా వారి కోసం పోరుబాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. ఇందులో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు ఏం చేయాలన్న అంశంపై చర్చించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి