Breaking News

పహల్గాంకు పర్యాటకులు క్యూ..


Published on: 23 Jun 2025 18:05  IST

జమ్ము కశ్మీర్‌ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాం లో గల మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్‌ వ్యాలీలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ దాడి తర్వాత జనం ఆ ప్లేస్‌కు వెళ్లేందుకు భయపడ్డారు. దీంతో పర్యాటకులు లేక వ్యాలీ మొత్తం ఇన్నిరోజులూ వెలవెలబోయింది. అయితే, ఇప్పుడు మళ్లీ అక్కడ సందడి వాతావరణం నెలకొంది.పెద్ద ఎత్తున టూరిస్ట్‌లు పహల్గాం బాట పట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి