Breaking News

మహిళా సంఘాలకు మినీ గోదాములు..


Published on: 27 Jun 2025 08:41  IST

రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఆధ్వర్యంలో మినీ గోదాముల నిర్మాణానికి కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఒక్కో గోదాము నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయించింది.ఈ గోదాములను నిర్మించి మహిళా సంఘాలకు అప్పగించాలని భావిస్తోంది. గోదాముల నిల్వ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, డీపీఆర్ లను సిద్ధం చేయడానికి నాబ్ కిసాన్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు.

Follow us on , &

ఇవీ చదవండి