Breaking News

హైకోర్టులో జగన్‌కు ఊరట.. విచారణ వాయిదా..


Published on: 27 Jun 2025 12:17  IST

గుంటూరు కారు ప్రమాదం కేసులో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను జూలై 1కి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, సింగయ్య మృతికి కారణమైన జగన్ కారును అధికారులు పరిశీలించారు. గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కారు ఫిట్‌నెస్‌‌ను పరిశీలించారు.

Follow us on , &

ఇవీ చదవండి