Breaking News

స్టాంపుల కుంభకోణంపై మంత్రి ఫైర్


Published on: 27 Jun 2025 15:00  IST

నకిలీ ఈ - స్టాంపుల కుంభకోణం వ్యవహారంపై రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ, డీఐజీలను ఆదేశించారు. ఈ వ్యవహారంపై శుక్రవారం అమరావతిలో ఉన్నతాధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఈ తరహా వ్యవహారం రాష్ట్రంలో పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి