Breaking News

దేశంలోని అన్ని పోస్టాఫీసులూ ఆగస్టు 1 నుంచి డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించనున్నాయి.

దేశంలోని అన్ని పోస్టాఫీసులూ ఆగస్టు 1 నుంచి డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించనున్నాయి.


Published on: 28 Jun 2025 16:40  IST

దేశంలోని అన్ని పోస్టాఫీసులూ ఆగస్టు 1 నుంచి డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించనున్నాయి. పోస్టల్‌ విభాగంలో ఐటీ నూతన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, డిజిటల్‌ చెల్లింపులకు వీలవుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పోస్టాఫీసులు యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) వ్యవస్థతో అనుసంధానం కాలేదు. ఈ నేపథ్యంలో డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించే విధంగా కొత్త అప్లికేషన్‌ తీసుకొస్తున్నామని, ఆగస్టు 1 నాటికి అన్ని పోస్టాఫీసుల్లో ఇది అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఐటీ   2.0 కింద ప్రయోగాత్మకంగా కర్ణాటక సర్కిల్‌లో డిజిటల్‌ చెల్లింపుల స్వీకరణ ప్రారంభమైంది.

Follow us on , &

ఇవీ చదవండి