Breaking News

ఏపీలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం


Published on: 03 Jul 2025 15:53  IST

ఏపీలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ తెలిపారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు డ్రగ్స్ రవాణాపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇవాళ(గురువారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఇతర రాష్ట్రాలకు కొరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను, గంజాయినీ ఈగల్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి